E-Paper
Advertisement

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. తిరుగు ప్రయాణంలో ఇలా చేయాలని మీకు తెలుసా?

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. తిరుగు ప్రయాణంలో ఇలా చేయాలని మీకు తెలుసా?
Advertisement

Tirumala News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి ఎందరో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుండి కూడా శ్రీవారి దర్శనానికి వస్తారు. కానీ శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అలాగే తిరిగి వచ్చే సమయంలో ఇలా చేస్తే మీ డబ్బు మీకు అందుతుంది. ఇంతకు ఏమి చేయాలో తెలుసుకుందాం.

గోవిందా అనే నామస్మరణం నోట పలికినా చాలు కదా.. ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే తిరుమల మాడవీధులు నిరంతరం గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. రోజుకు సుమారు లక్ష మంది భక్తులు, శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల రద్దీ అధికం. శేషాచలం కొండల మార్గం గుండా తిరుమలకు చేరుకొని, ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం పొందాలని, సుదూర ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు వస్తారు. అంతేకాదు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం గుండా కూడా స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరుతారు.

Advertisement

ఇలా ఎందరో భక్తులు నిరంతరం వచ్చే తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా ఆదర్శంగా ఉండాలన్నది టీటీడీ లక్ష్యం. అందుకే నో ప్లాస్టిక్ జోన్ గా తిరుమలను ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను, దబ్బాలను వినియోగించకూడదన్నది అసలు ఉద్దేశం. పవిత్రమైన తిరుమల గిరులు స్వచ్చమైన ప్రకృతికి నిదర్శనంగా పేరుగాంచాలని టీటీడీ పలు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీవారి భక్తులకు గాజు సీసాలో నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ బాటిల్స్ ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Also Read: South Central Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Advertisement

అయితే భక్తులు రూ. 50 లు చెల్లించి నీరు గల గాజు సీసాను కొనుగోలు చేస్తూ, టీటీడీ తీసుకున్న నిర్ణయానికి బాసటగా నిలుస్తున్నారు. ఇక్కడే టీటీడీ తీసుకున్న మరో నిర్ణయం తెలియని భక్తులు, వాటిని అలాగే గృహాలకు తెచ్చుకుంటారు. కానీ శ్రీవారి భక్తులు దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం సమయంలో ఆ గాజు సీసాను ఏ షాపులో అప్పగించినా, వారికి రూ.30 లు తిరిగి అందిస్తారు. అంటే కేవలం రూ. 20 లతో మనం స్వచ్చమైన నీటిని కొనుగోలు చేసినట్లుగా భావించవచ్చు. భక్తుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకై టీటీడీ గాజుసీసాలో నీటిని అందించే కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు తిరుమల వెళ్తున్నారా.. గాజుసీసాలో నీరు త్రాగండి.. తిరుగు ప్రయాణంలో అదే సీసా అప్పగించి రూ. 30 లు రిటర్న్ తీసుకోవడం మరచిపోవద్దు సుమా!

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×