BigTV English
Advertisement

South Central Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

South Central Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Tirupati Special Trains: తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ పెరిగిన నేపథ్యంలో వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. హిసార్ నుంచి తిరుపతికి 2 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. అటు సికింద్రాబాద్, విశాఖ మధ్యలో నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు కోచ్ ల సంఖ్య పెంచుతున్నట్లు తెలిపింది.


వీక్లీ స్పెషల్ రైళ్ల వివరాలు

ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హిసార్-తిరుపతి నడుమ రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత సెంట్రల్ రైల్వే వెల్లడించింది. హిసార్- తిరుపతి ప్రత్యేక రైలు(04717) ప్రతి శనివారం హిసార్ నుంచి బయల్దేర నుంది. మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి-హిసార్ స్పెషల్ ట్రైన్(04717) ప్రతి సోమవారం తిరుపతి నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మంగళవారం నాడు హిసార్ కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లను తిరుపతి భక్తులతో పాటు సాధారణ ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


వందేభారత్ రైళ్లకు అదనపు బోగీలు

అటు సికింద్రాబాద్- విశాఖపట్నం నడుమ నడిచే వందేభారత్ రైలుకు డిమాండ్ భారీగా ఏర్పడిన నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు అదనపు బోగీలను యాడ్ చేస్తున్నట్ల వెల్లడించింది. ప్రస్తుతం ఈ రైలు 8 కోచ్ లతో నడుస్తుండగా, ఇకపై ఆ సంఖ్యను 16కు పెంచనున్నారు. అటు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 16 కోచ్ ల రైలు నడుస్తున్నది. దీనికి కూడా ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో మరో 4 కోచ్ లను యాడ్ చేయనున్నారు. ఇకపై ఈ రైలు 20 కోచ్ లతో అందుబాటులోకి రానుంది. రీసెంట్ గా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్ లో ఏర్పాటు చేయడంతో పాటు రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తగ్గిస్తామని కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లకు బోగీల సంఖ్య పెరగడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పలు రైళ్ల దారి మళ్లింపు

అటు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ లోని విశాఖపట్నం- కిరండూల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ లను పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. మరోవైపు గుంతకల్ డివిజన్ లో ఈ నెల రైల్వే లైన్లకు సంబంధించి సెక్యూరిటీ పనులు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంద్యాల-థోనే-అనంతపురం రైట్లలో నడవాల్సిన రైళ్లు.. నంద్యాల- యర్రగుంట్ల- గూటి-అనంతపురం మీదుగా నడవనున్నాయి. ప్రయాణీకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?

Related News

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Big Stories

×