E-Paper
Advertisement

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూ మారుతోంది

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూ మారుతోంది

TTD News: శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ తగిన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా బీ.ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమలలో టీటీడీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కేవలం గంట వ్యవధిలోనే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నించడం విశేషం. ఇలా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించిన టీటీడీ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తుంటారు. తిరుమల కు వచ్చిన ప్రతి భక్తుడు తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని స్వీకరించినట్లుగానే, తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించడం ఆనవాయితీ. అలా భక్తులకు అందించే అన్న ప్రసాదంకు సంబంధించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూకు సంబంధించి, మరొక ఆహార పదార్థాన్ని పెంచాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. చైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా మెనూలో పలుమార్పులు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీవారి భక్తులకు ఐదువేల మసాలా వడలను టీటీడీ అధికారుల పర్యవేక్షణలో వడ్డించారు. ఈ మసాలా వడలు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా తయారు చేయడం విశేషం.

Also Read: Chandra Gochar 2025: పంచమహాయోగం.. 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు

టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్న ప్రసాదం స్వీకరించిన శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించామని, త్వరలోనే చైర్మన్ చేతుల మీదుగా మెనూలో మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×