Tirumala: ఈ ఏడాది మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. శ్రీవారి ఆలయం తలుపులు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 3న మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు దాదాపు మూడున్నర గంటలు ఉంటుంది. గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
మార్చి 03వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఆ రోజు రాత్రి 8:30 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకర సేవను టీటీడీ రద్దు చేసింది.
Read Also: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, దేవేరులతో కలిసి పాల్గొనే ప్రణయ కలహోత్సవం ఇవాళ జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తారు.