Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ పేర్కొంది. డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది. టీటీడీ 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది.
డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. పైన పేర్కొన్న రోజుల్లో ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని కోరింది.
Also Read: Pawan Kalyan: ఎవరినీ వదిలిపెట్టం.. బిగ్ టీవీ కథనాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్