E-Paper
Advertisement

Train Derailment : యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ.. రంగంలోకి హెవీ డ్యూటీ క్రేన్స్

Train Derailment : యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ.. రంగంలోకి హెవీ డ్యూటీ క్రేన్స్
Advertisement

Train Derailment : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ట్రాక్‌ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రతి నిమిషం ముఖ్యమే అన్నట్టుగా దూసుకుపోతున్నాయి రెస్క్యూ టీమ్స్‌.ఇప్పటికే ప్రమాదం జరిగి 15 గంటలు దాటడంతో వెంటనే ట్రాక్‌ను పునురుద్దరించి ట్రాక్‌పై మళ్లీ రైళ్ల పరుగులను ప్రారంభించాలని చూస్తోంది రైల్వే శాఖ. రెండు రైళ్లు ఢీకొనడం.. బోగీలు పక్కనే ఉన్న గూడ్స్‌ రైలుపై పడటంతో రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇప్పటికే డ్యామేజ్‌ అయిన బోగీలు కాకుండా మిగిలిన బోగీలను అక్కడి నుంచి తరలించారు. ఇక డ్యామేజ్‌ అయిన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించే పనులను ప్రారంభించారు. హేవీ డ్యూటీ క్రేన్లను రంగంలోకి దింపారు. బోగీలను పక్కకు తప్పించి ట్రాక్‌ను పునరుద్దరిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మొదట క్షతగాత్రులను బయటికి తీయడం.. ఆసుపత్రులకు పంపడంపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ.. ఆ తర్వాత అసలు పనులను మొదలు పెట్టిందనే చెప్పాలి.

Advertisement

ఇప్పటికే 14 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. మరో ఐదు రైళ్ల దారిని మళ్లించింది. ప్రస్తుతం NDRF, ఏపీ స్టేట్‌ DRF సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు రైల్వేశాఖ ట్రాక్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది. సిగ్నలింగ్, హైటెన్షన్‌ వైర్‌, కొత్త ట్రాక్‌ను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ ట్రాక్‌పై రైళ్లను పరిగెత్తిస్తామని చెబుతున్నారు రైల్వే అధికారులు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×