Tribal Students: పోలవరం జిల్లా కూనవరం మండలం గిరిజన రేపాక ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చోసుకుంది. చదువు కొవాల్సిన పిల్లలతో పాఠశాల యాజమాన్యం సిబ్బంది అడవిలో నుండి బరువైన చెట్ల మెద్దులను మొపిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల అగచాట్లు పెట్టిస్తున్నారు. సిబ్బంది అంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో బరువైన మొద్దులు పాఠశాలకు మోపిస్తున్నారు.
అయితే వాలి బాల్ కోర్ట్ కోసం అడవి నుండి మొద్దులు నరికి హాస్టల్కి విద్యార్థులు మోసుకువస్తున్నారు. పిల్లలందరు కలిసి కిలో మీటర్ దూరం నుండి ఓక్కో విద్యార్ధి 2 చొప్పున బరువైన మొద్దులను విద్యార్థులతో మొయించారు. ఈ సంఘటన పై పాఠశాల హెచ్ ఎం, వార్డెన్ మాకేం పట్టనట్టుగా వ్యవహరిచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంపై కొంత మంది తల్లిదండ్రులు చదువుకునే పిల్లలతో పని చేయించడం ఎంటని అడగగా.. పని చేయిస్తే తప్పేంటి అని స్కూల్ హెచ్ ఎం దురుసుగా తల్లితండ్రులతో మాట్లాడారు. పిల్లలతో పనిచేయించడం ఎంటని తల్లిదండ్రులు కొంత మంది ఆవేదర వ్యక్తం చేశారు.
Also read: SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!
చదువుకోసం పిల్లలను పాఠశాలకు పంపిస్తే మొద్దులు మోపించడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలంటూ తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై సీరియస్ అయిన బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు పిల్లలతో మొద్దులు మోపించడం నేరం అని.. కమీషన్ తరపున విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు హామీ ఇచ్చారు. చదువునే పిల్లలతో పనులు చేయించడం చట్ట రీత్యానేరం అని ఉండవల్లి బాబు అన్నారు.
Also read: Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!