Srisailam Traffic: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి లింగాలగట్టు వరకు వాహనాల బారులు తీరుతున్నాయి. దాదాపుగా శ్రీశైలం ఎంట్రన్స్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా రెండు రోజుల సెలవులు ఉండటంతో శ్రీశైలంకి భక్తులు తరలి వస్తున్నారు.
దీంతో 15 నుండి 20 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకొని నకకయాతన పడుతున్నారు. వాహనదారులు రహదారిపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఇబ్బందులు పడుతున్నారు.
Also read: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!
ఈ భారీ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా రెండురోజుల పాటు సెలవులుండటంతో దైవదర్షనం కోసం భక్తులు తరలి వస్తున్నారు.
Also read: తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?