Pawan Kalyan: రాష్టంలో జనసేన నాయకులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కానీ రాజకీయ వేదికలలో గానీ మాట్లాడే టప్పుడు ఎవరూ కూడా వ్యక్తిగత విషయాలనుద్దేశించి మాట్లాడోద్దని పవన్ కల్యాన్ తెలిపారు. అనవసర భాషను ఉపయోగించి వ్యక్తిగత విషయాలలో తలదూర్చోద్దని తెలిపారు.
దీనికోసం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పవన్ కల్యాన్ కీలక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అంశాల జోలికి అస్సలే వెళ్లవద్దు అని పవన్ కల్యాన్ తెలిపారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా నేటి రాజకీయానికి మనం ఆదర్షం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ శత్రువుల వలలో పడవద్దని, పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.
Also Read: ఇదే మంచి తరుణం.. ఇలాంటి సర్కార్ ఇప్పట్లో మళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..
కావాలని కొంత మంది జనసేనా నాయకులు రెచ్చగొతున్నారని వారికి దూరంగా ఉండాలని సీఎం తెలిపారు. విమర్షలను తిప్పికొడుతూ పార్టీకోసం అందరూ కలిసి పనిచేయాలని పవన్ కల్యాన్ తెలిపారు. రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలి పిలుపునిచ్చారు.
Also Read: కేసీఆర్ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!