E-Paper
Advertisement

TTD latest update : ఇక సొంతంగా నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయాలు..

TTD latest update : ఇక సొంతంగా నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయాలు..
Advertisement
TTD news today in telugu

TTD news today in telugu(Today’s state news):

కర్నాటకకు చెందిన నందిని నెయ్యిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించింది. మరి, బయటి నుంచి నెయ్యి కొనుగోలు ఆపేస్తుందా? టీటీడీనే సొంతంగా నెయ్యి తయారు చేసుకుంటుందా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక, టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన చివరి పాలక మండలి సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యాక్రాంతం అవుతున్న టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. దేవస్థానానికి చెందిన 68 స్థలాలకు కంపె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రూ.1.25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.

Advertisement

ఘాట్ రోడ్డులో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలపై టీటీడీ దృష్టి సారించింది. రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేసేందుకు రూ.24 కోట్లు కేటాయించింది. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో వారి సౌకర్యార్థం తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో రూ.2.6 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలు ఇవే…

Advertisement

–రూ.4 కోట్లతో అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తుల కోసం షెడ్లు ఏర్పాటు
–రూ.2.5 కోట్లతో పీఏసీలో మరమ్మతు పనులు.
–రూ.23.50 కోట్లతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం
–రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు
–రూ.9.85 కోట్లతో వకుళమాత ఆలయం దగ్గర అభివృద్ధి పనులు
–రూ.3 కోట్లతో శ్రీనివాసం దగ్గర సబ్ వే నిర్మాణం
–శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయింపు
–ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్లు
–రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు
–ఎస్‌వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×