E-Paper
Advertisement

TTD News: తిరుమలలో కొత్త తరహా అన్యమత ప్రచారం.. ఫిర్యాదు చేసిన భక్తుడు.. ఆ తర్వాత?

TTD News: తిరుమలలో కొత్త తరహా అన్యమత ప్రచారం.. ఫిర్యాదు చేసిన భక్తుడు.. ఆ తర్వాత?

TTD News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీటీడీ ఎన్ని చర్యలు చేపడుతున్న.. ఏదో ఒక రీతిలో అన్యమత ప్రచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి, తిరుమలలో అన్యమత ప్రచారం సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల పలు వ్యాపార సముదాయాలను సైతం చైర్మన్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు సైతం జారీ చేశారు. ఈ తరుణంలో అన్యమత ప్రచారానికి సంబంధించి గురువారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ తన కుటుంబంతో సహా వచ్చారు. అయితే తమ చిన్నారి కడియం కొనుగోలు చేయాలని మారాం చేయడంతో, వారు తిరుమలలోని వ్యాపార సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ కడియాన్ని కొనుగోలు చేసి, బస చేసిన రూమ్ వద్దకు చేరుకున్నారు.

ఈ దశలో కడియాన్ని వారు పరిశీలించగా, దానిపై అన్యమతం పేరు, గుర్తు ఉండడాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. వెంటనే టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడుకు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు సైతం స్పందించి వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. కడియం విక్రయించిన షాపును సీజ్ చేసి, వ్యాపారస్తులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.

తిరుమలలో అన్యమత ప్రచారం కట్టడికి టీటీడీ అన్నీ చర్యలు తీసుకుంటున్నా, ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంతో చైర్మన్ సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని, వ్యాపార సముదాయాలను నిరంతరం తనిఖీ చేయాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే అన్యమత ప్రచారానికి సంబంధించి కడియాలను, ఇతర సామాగ్రిని విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించే పనిలో టీటీడీ విజిలెన్స్ విభాగం నిమగ్నమైంది.

Also Read: AP Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై సూపర్ టెక్నాలజీ తరగతులు..

ఫిర్యాదు ఇచ్చిన వెంటనే టీటీడీ అధికారులు స్పందించడం పై ఫిర్యాదు చేసిన భక్తుడు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల పలువురు తిరుమల పరిసర ప్రాంతాలలో రీల్స్ చేసి వైరల్ కాగా, తక్షణం జరిగిన పొరపాటును గుర్తించిన వారు క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఇలా వివాదాస్పద రీల్స్ చేసేవారిని గుర్తించి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×