BigTV English
Advertisement

TTD News: తిరుమలలో కొత్త తరహా అన్యమత ప్రచారం.. ఫిర్యాదు చేసిన భక్తుడు.. ఆ తర్వాత?

TTD News: తిరుమలలో కొత్త తరహా అన్యమత ప్రచారం.. ఫిర్యాదు చేసిన భక్తుడు.. ఆ తర్వాత?

TTD News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీటీడీ ఎన్ని చర్యలు చేపడుతున్న.. ఏదో ఒక రీతిలో అన్యమత ప్రచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి, తిరుమలలో అన్యమత ప్రచారం సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల పలు వ్యాపార సముదాయాలను సైతం చైర్మన్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు సైతం జారీ చేశారు. ఈ తరుణంలో అన్యమత ప్రచారానికి సంబంధించి గురువారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.


తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ తన కుటుంబంతో సహా వచ్చారు. అయితే తమ చిన్నారి కడియం కొనుగోలు చేయాలని మారాం చేయడంతో, వారు తిరుమలలోని వ్యాపార సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ కడియాన్ని కొనుగోలు చేసి, బస చేసిన రూమ్ వద్దకు చేరుకున్నారు.

ఈ దశలో కడియాన్ని వారు పరిశీలించగా, దానిపై అన్యమతం పేరు, గుర్తు ఉండడాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. వెంటనే టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడుకు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు సైతం స్పందించి వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. కడియం విక్రయించిన షాపును సీజ్ చేసి, వ్యాపారస్తులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.


తిరుమలలో అన్యమత ప్రచారం కట్టడికి టీటీడీ అన్నీ చర్యలు తీసుకుంటున్నా, ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంతో చైర్మన్ సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని, వ్యాపార సముదాయాలను నిరంతరం తనిఖీ చేయాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే అన్యమత ప్రచారానికి సంబంధించి కడియాలను, ఇతర సామాగ్రిని విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించే పనిలో టీటీడీ విజిలెన్స్ విభాగం నిమగ్నమైంది.

Also Read: AP Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై సూపర్ టెక్నాలజీ తరగతులు..

ఫిర్యాదు ఇచ్చిన వెంటనే టీటీడీ అధికారులు స్పందించడం పై ఫిర్యాదు చేసిన భక్తుడు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల పలువురు తిరుమల పరిసర ప్రాంతాలలో రీల్స్ చేసి వైరల్ కాగా, తక్షణం జరిగిన పొరపాటును గుర్తించిన వారు క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఇలా వివాదాస్పద రీల్స్ చేసేవారిని గుర్తించి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×