E-Paper
Advertisement

Tirumala: తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల.. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు

Tirumala: తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల.. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు
Advertisement

Tirumala:తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెల దర్శన కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లు కన్ఫార్మ్ చేసుకోవచ్చు.

జనవరి 22న ఆర్జిత సేవా టికెట్ల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల వ‌సంతోత్సవాల‌ టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

జనవరి 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు

Advertisement

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను జనవరి 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

Advertisement

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జనవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

గదుల కోటా

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల

మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది.

జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్తమి

సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న తిరుమ‌లలో రథసప్తమి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మాఘ మాసంలో రథ సప్తమి రోజున సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమిని పుర‌స్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమ‌ల‌కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు.

వాహనసేవల వివరాలు

• జనవరి 25 తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు– సూర్యప్రభ వాహనం.

• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.

• ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.

• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.

• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.

• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.

• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.

• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

ఆర్జిత సేవలు రద్దు

రథసప్తమి కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

Also Read: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలనం.. లంచం తీసుకున్నట్టు అంగీకరించిన టీటీడీ మాజీ అధికారి

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×