BigTV English
Advertisement

Tirumala News: టీటీడీ వార్నింగ్.. ఆ ప్రాంతం టీటీడీ పరిధిలోకి రాదు, ప్రచారం చేసినవారిపై చర్యలు

Tirumala News: టీటీడీ వార్నింగ్..  ఆ ప్రాంతం టీటీడీ పరిధిలోకి రాదు, ప్రచారం చేసినవారిపై చర్యలు

Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీహరి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడు కొండలపై వేంకటేశ్వరుడు వెలసిన క్షేత్రం కావడంతో ఆ ప్రాంతాన్ని దైవ సన్నిధిగా భావిస్తున్నారు భక్తులు. అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, భక్తులు మండిపడుతుంటారు.


అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారన్న వార్తలు హంగామా చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలలో అపచారం జరిగిందంటూ ఓ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘తిరుమలలో మరొక అపచారం.. వదలని మందు బాబులు!, శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు. మందు తాగేసి బాటిల్స్‌ను మెట్లపై విసురుతున్న మందుబాబులు.

కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట’’ అంటూ పోస్టు చేశారు. మద్యం తాగిన ఓ వ్యక్తి ఖాళీ మందు బాటిల్‌ను మెట్లపైకి విసిరేస్తున్నారని ఆ వీడియోలో కనిపించింది. ఈ వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం రియాక్ట్ అయ్యింది. దీనిపై ఎక్స్ వేదికగా అసలు విషయాలు బయటపెట్టింది.


శ్రీవారి సన్నిధిలో మద్యం సేవించారని చెప్పే వీడియో అబద్ధం, తప్పుదారి పట్టించేదిగా ఉందని తెలిపింది. ఆ వీడియోలోని ప్రదేశం తిరుమల ప్రాంగణంలో లేదని పేర్కొంది. తిరుమల పవిత్రతను కించపరిచే ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాసుకొచ్చింది.

ALSO READ: ఇంటిగుట్టు బయటకు.. కూతురిపై ముద్రగడ విసుర్లు, పబ్లిసిటీ కోసం దిగజారొద్దు

సదరు తాగుబోతు వ్యక్తి ఫోటోను బయటపెట్టింది. పైన పేర్కొన్న వార్త తప్పని చెబుతూనే, మందుబాబు ఉన్న ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని పేర్కొంది. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వ్యక్తులపై రేపో మాపో చర్యలు తీసుకోనుంది.

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు పగ్గాలు చేపట్టిన నుంచి తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై చర్యలు ఉంటాయని పదేపదే చెబుతున్నారు. ఆయన చెప్పినట్టుగానే తప్పుడు ప్రచారం చేసినవారిపై ఉక్కుపాదం మోపనుంది టీడీడీ.

 

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×