BigTV English

East Godavari: ఇంటిగుట్టు బయటకు.. కూతురిపై ముద్రగడ రుసరుస, పబ్లిసిటీ కోసం దిగజారొద్దు

East Godavari: ఇంటిగుట్టు బయటకు.. కూతురిపై ముద్రగడ రుసరుస,  పబ్లిసిటీ కోసం దిగజారొద్దు

East Godavari: చాన్నాళ్లు తర్వాత మీడియా ముందుకొచ్చారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఈసారి పార్టీ వ్యవహారాలపై ఆయన నోరు ఎత్త లేదు. కేవలం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. తన కూతురు క్రాంతి కామెంట్స్ పై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు ముద్రగడ.


తన ఆరోగ్య సమస్యలపై రకరకాల వార్తలు రావడంతోపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. మా కుటుంబం‌పై మరొక ఫ్యామిలీ దాడి చేస్తుందన్నారు. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్ల కిందటే మనస్పర్ధలు వచ్చాయన్నారు. చిన్నకొడుకు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలి పోతున్నారని కూతురు పేరు ఎత్తకుండా వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ తాను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు కారణం గిరిబాబు అని చెప్పకనే చెప్పారు. అబ్బాయిని దూరం చేసుకుని వారి ఇంటికి చేరుతానని అనుకుంటున్నారని గుర్తు చేశారు. అది ఈ జన్మలో జరగదని కూతురికి మీడియా ముఖంగా తేల్చి చెప్పారు. వారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవన్నారు.


తనను బంధించి, మానసికంగా హింసించడం ఎవరితరం కాదని చెప్పకనే చెప్పారు. మీ అపాయింట్మెంట్లు చీప్ పబ్లిసిటీ కోసం దిగజార వద్దని కాసింత రుసరుసలాడారు. వైసీపీ కార్యక్రమాలకు తాను హాజరవు తున్నానని, ఇంటికి వచ్చిన అభిమానులు, ప్రజలను కలుస్తున్నట్లు వెల్లడించారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయించి డబ్బా కొట్టుకోవాలంటూ తనదైన శైలిలో సూచించారు ముద్రగడ.

ALSO READ: సాక్షిఛానెల్ విశ్లేషకుడు కొమ్మినేని అరెస్ట్

ఇంతకీ ముద్రగడ కూతురు క్రాంతి ఇటీవల ఏయే విషయాలు వెల్లడించింది. తన తండ్రి ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది. కొడుకు గిరి తంద్రికి ట్రీట్ మెంట్ అందించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమార్తె క్రాంతి ప్రస్తావించిన అంశాలపై ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేశారు.

ముద్రగడ పద్మనాభం-కూతురు క్రాంతి మధ్య కుటుంబాల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయటపడింది. తండ్రి-కూతుళ్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో క్రాంతి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కావడం, ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చకచకా జరిగిపోయింది.

ఆ సమయంలో ముద్రగడపై విరుచుకుపడ్డారు. కూతురు కామెంట్లపై ముద్రగడ కూటమిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో జరుగుతున్న వ్యవహారాలు బయటకువచ్చాయి. రానున్న రోజుల్లో తండ్రి-కూతురు మధ్య అంతర్గత వ్యవహారాలు ఇంకెన్ని మలుపులు తిరగనున్నాయో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×