BigTV English

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ర్యాలీలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది.


వేదికకు సమీపంలోనే కాలువ ఉండటంతో.. తోపులాటలో పలువురు కార్యకర్తలు కాలువలో పడిపోయారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

విషయం తెలిసి చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.


మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారు.. రవీంద్ర, యానాది, పురుషోత్తం, యటగిరి విజయ, కకుమాను రాజా, చిన కొండయ్యగా తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×