BigTV English
Advertisement

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ర్యాలీలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది.


వేదికకు సమీపంలోనే కాలువ ఉండటంతో.. తోపులాటలో పలువురు కార్యకర్తలు కాలువలో పడిపోయారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

విషయం తెలిసి చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.


మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారు.. రవీంద్ర, యానాది, పురుషోత్తం, యటగిరి విజయ, కకుమాను రాజా, చిన కొండయ్యగా తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×