E-Paper
Advertisement

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..
Advertisement

TDP: బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ర్యాలీలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది.

వేదికకు సమీపంలోనే కాలువ ఉండటంతో.. తోపులాటలో పలువురు కార్యకర్తలు కాలువలో పడిపోయారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

విషయం తెలిసి చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారు.. రవీంద్ర, యానాది, పురుషోత్తం, యటగిరి విజయ, కకుమాను రాజా, చిన కొండయ్యగా తెలుస్తోంది.

Advertisement

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×