E-Paper
Advertisement

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..
Advertisement

TDP: బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ర్యాలీలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది.

వేదికకు సమీపంలోనే కాలువ ఉండటంతో.. తోపులాటలో పలువురు కార్యకర్తలు కాలువలో పడిపోయారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

విషయం తెలిసి చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారు.. రవీంద్ర, యానాది, పురుషోత్తం, యటగిరి విజయ, కకుమాను రాజా, చిన కొండయ్యగా తెలుస్తోంది.

Advertisement

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×