E-Paper
Advertisement

Car Accident: అతి వేగం.. ఏడు పల్టీలు కొట్టిన కారు, ఆ తర్వాత..

Car Accident: అతి వేగం.. ఏడు పల్టీలు కొట్టిన కారు, ఆ తర్వాత..

Car Accident: చిత్తూరు జిల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఘోరమైన ప్రమాదం జరగ్గా, తాజాగా శనివారం మరో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు-చెన్నై హైవే మీదుగా వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లో మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

శనివారం ఉదయం బెంగుళూరు నుంచి తిరుపతి ఏడుగురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ తిరుపతికి వస్తోంది. హైవే రోడ్డు కావడంతో ఇన్నోవా కారు స్పీడ్‌గా వెళ్తోంది. అయితే చిత్తూరు జిల్లా బంగారుపాలెం సమీపంలోకి రాగానే కారు టైరు పేలిపోయింది. కారు స్పీడ్‌ను డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు.

కారు ఏడు పల్టీలు కొట్టింది. చివరకు బ్రిడ్జి పక్కనేవున్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు వున్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారుగా తెలుస్తోంది. సేఫ్టీ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ALSO READ: సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి

వేగానికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. వీరంతా ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? అనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×