E-Paper
Advertisement

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి కన్నుమూత.. కేసీఆర్ దిగ్భ్రాంతి, సీఎం రేవంత్ సంతాపం

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి కన్నుమూత.. కేసీఆర్ దిగ్భ్రాంతి, సీఎం రేవంత్ సంతాపం
Advertisement

Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ‌రావు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.  కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వార్త తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ‌రావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా వెల్లడించారు.

Advertisement

సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని సూచన చేశారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కేసీఆర్.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  హరీష్‌రావుని మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ పరామర్శించారు. అటు కేటీఆర్ ఇంటికి వెళ్లి హరీష్‌రావు కుటుంబసభ్యులను ఓదార్చి, సంతాపం తెలిపారు.  సత్యనారాయణరావు అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.

Advertisement

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సత్యనారాయణ‌రావు. ఆయన మరణవార్త తెలియగానే పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. హరీష్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×