E-Paper
Advertisement

Fire To Chilli Crop : పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..

Fire To Chilli Crop :  పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..
Advertisement

Fire To Chilli Crop : పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంటలో మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పంట తగలబడటంతో రూ. 2.5 లక్షల ఆస్తి నష్టం కలిగిందని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.

పల్లెగుంటలో దీకొండ రమణ మిర్చి పంట సాగు చేశారు. మిర్చిని కల్లంలో ఆరబోసి రాత్రి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసే సరికి పంట దగ్ధమైంది. దీంతో ఆ రైతు భావోద్వేగానికి లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కల్లంలో ఆరబోసిన 15 క్వింటాళ్ల ఎండు మిర్చి పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

రాత్రి సమయంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని బాధితుడు రమణ అనుమానం వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతు ప్రభుత్వానికి వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×