BigTV English
Advertisement

DMK MLA’s Son : పనిమనిషిపై హింస కేసు.. పరారీలో ఎమ్మెల్యే కొడుకు, కోడలు ..

DMK MLA’s Son : పనిమనిషిపై హింస కేసు.. పరారీలో ఎమ్మెల్యే కొడుకు, కోడలు ..

DMK MLA’s Son : ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలుపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న వారిద్దరిని అరెస్టు చేసేందుకు మూడు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.


తమిళనాడులోని పల్లావరం ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివాణన్‌, కోడలు మెర్లినా తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఫిర్యాదు రావడంతో నీలాంగరై ఆల్‌ ఉమెన్‌ పోలీసులు వారిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం.

6 రోజుల క్రితం వారిపై కేసులు నమోదైంది. అప్పటినుంచి మదివాణన్, మెర్లినా ఆచూకీ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు ప్రత్యేక పోలీసు బృందలను ఏర్పాటు చేశారు. ఇద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


మదివాణన్, మెర్లినా.. బాధిత యువతిని ఎలా హింసించేవారో పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు. దాని ప్రకారం.. ఇటీవల వారితోపాటున పని మనిషిని ముంబయి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా వంట చేయలేదని దాడిచేశారు. పచ్చి మిరపకాయ తినిపించి హింసించారు. వాతలు పెట్టారు. రక్తం వచ్చేలా కొట్టేవారని మదివాణన్, మెర్లినాపై కేసు నమోదైంది. మూడేళ్లు తమ వద్దే పనిచేయాలని సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని అభియోగాలు నమోదయ్యాయి. కులం పేరుతో తిడుతూ తరచూ దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×