E-Paper
Advertisement

Vizag harbour news: సీఎం రావాల్సిందే.. ఫిషింగ్ హార్బర్ వద్ద బాధితుల ఆందోళన.. లోకేష్ ట్వీట్

Vizag harbour news: సీఎం రావాల్సిందే.. ఫిషింగ్ హార్బర్ వద్ద బాధితుల ఆందోళన.. లోకేష్ ట్వీట్
Vizag fishing harbour news

Vizag fishing harbour news(AP breaking news today) :

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నిన్న అర్థరాత్రి చెలరేగిన మంటల్లో 40కి పైగా బోట్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. లక్షల విలువైన మత్స్యసంపద కాలి బూడిదైంది. దాంతో బాధితులు లబోదిబోమంటూ విలపించారు. బాధిత మత్స్యకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. మత్స్యకార నాయకులు నిరసన చేపట్టారు. ఫిషింగ్ హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వెంటనే నష్టపరిహార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సాయంత్రంలోగా ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి న్యాయం చేయాలని, ఒక్కో బోటుకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకూ పోరాడుతామని భీష్మించారు.

కాగా.. టీడీపీ నేత నారా లోకేష్ విశాఖ అగ్నిప్రమాదంపై స్పందించారు. “విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించింది. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.” అని Xలో ట్వీట్ చేశారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×