BigTV English
Advertisement

Vijaya Sai Reddy: వాళ్లంతా ఎన్టీఆర్-ల‌క్ష్మీ పార్వ‌తి స‌న్నిహితులే.. విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్!

Vijaya Sai Reddy: వాళ్లంతా ఎన్టీఆర్-ల‌క్ష్మీ పార్వ‌తి స‌న్నిహితులే.. విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. సీఎం చంద్ర‌బాబుకు వీర విధేయుల్లో కొంద‌రు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్- ల‌క్ష్మీ పార్వ‌తికి అత్యంత స‌న్నిహితులు అని పేర్కొన్నారు. ఇది చారిత్ర‌క ప‌రిణామం అని, దాచినా దాగ‌ని నిజం అని, మార్చ‌లేని స‌త్య‌మ‌ని విజ‌య‌సాయి రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. వీళ్లంతా 1994-1996లో ఫిరాయింపు దారులని ఆరోపించారు. ఆ విష‌యం మీడియాకు, ప్ర‌జ‌ల‌కు గుర్తుండ‌దు అని అనుకోవ‌డం వారి అజ్ఞానం అని చెప్పారు.


అంతే కాకుండా వాళ్లంతా ఇప్పుడు పుట్టుక‌తోనే చంద్ర‌బాబు విధేయులం అని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు అంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అంతే కాకుండా ఇది ప్ర‌జ‌ల‌ను వంచించ‌డం అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫిరాయింపు దారుల‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, ప్రతిభా భారతి, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశిరెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబూరావు ఉన్నారని తెలిపారు.

అంతే కాకుండా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వారిలో చంద్ర‌బాబు, య‌నమ‌ల, అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఉన్నార‌ని చెప్పారు. వీళ్ల‌లో తొంభైశాతం మంది ఎన్టీఆర్ మ‌ర‌ణించిన త‌ర‌వాత‌నే 1996 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ ల‌క్ష్మీపార్వ‌తి వ‌ర్గం ఒక్క సీటు గెల‌వ‌క‌పోవ‌డంతో గుట్టుచ‌ప్పుడు కాకుండా చంద్ర‌బాబు పార్టీలో చేరార‌న్నారు. 1997-2004 మ‌ధ్య ఉమ్మ‌డి ఏపీ టీడీపీ మంత్రివ‌ర్గం స‌భ్యులుగా కొంద‌రు ఎంపీలుగా, మ‌రికొంద‌రు పార్టీ ప‌ద‌వులు పొందార‌ని వివ‌రించారు. ఇది మాయ‌ని మ‌చ్చ అని, చ‌రిత్ర క్ష‌మించ‌ద‌ని విజ‌య‌సాయి రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.


Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×