E-Paper
Advertisement

Vijayasai Reddy Resign: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం

Vijayasai Reddy Resign: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం

Vijayasai Reddy Resign: అన్నట్లుగానే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్‌కు అందజేశారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు తన రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు. ఈ సమయంలో ఇరువురు మధ్య రాజకీయ అంశాలు చర్చలు వచ్చాయి. కాకపోతే వీఎస్ఆర్ ఏం మాట్లాడరనేది ఆసక్తికరంగా మారింది.

విజయసాయిరెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్ వ్యవహారం తెలియగానే అధినేత జగన్ రాయబారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శనివారం విజయసాయిరెడ్డి ఇంటిని తిరుపతి ఎంపీ గురుమూర్తి, పుల్లి సుభాస్ చంద్రబోస్‌లను  పంపారు. వీఎస్ఆర్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ఎంపీ గురుమూర్తి. ఇది ఒక విధంగా షాక్‌కు గురిచేసిందన్నారు. ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు.

వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డిని కలవడానికి వచ్చానని తెలిపారు. ఆయనతోపాటు సుభాస్ చంద్రబోస్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని ఖరాఖండిగా చెప్పారు. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాయని, తన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయ్యిందని సహచర ఎంపీలతో అన్నట్లు ఢిల్లీ సమాచారం. అనంతరం అక్కడి నుంచి రాజ్యసభ ఛైర్మన్ ధన్ కడ్‌ను కలిశారు.

మరోవైపు తోటి ఎంపీలతో మాట్లాడుతుండగానే విజయసాయిరెడ్డి కొత్త అవతారం ఎత్తారు. ఎప్పుడు ఏపీ రాజకీయాలు, అధికార పార్టీ నేతల గురించి తనదైన శైలిలో సెటైర్లు వేసే ఆయన, తన ఆలోచన మార్చుకున్నారు. త్వరలో దక్కకున్న కొత్త పదవి నేపథ్యంలో రూటు మార్చారు. ఏకంగా అక్రమ వలసదారులపై మనసులోని ఆవేదనను బయటపెట్టారు.

ALSO READ:  వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి

‘దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని రాసుకొచ్చారు. చాలా వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని, కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రస్తావించారు. ఈ పరిస్థితి దేశంలో శాంతి, భద్రతలకు పెను సవాలుగా వర్ణించారు.

అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని తాను కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడ కూడదన్నది తన ఆలోచనగా ప్రస్తావించారు.

వీఎస్ఆర్ ట్వీట్‌పై కొందరు నేతలు రియాక్ట్ అవుతున్నారు. రాజీనామా తర్వాత ఆయన మాటల్లో మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ మార్పుకు కారణమేంటి అంటూ చర్చించుకోవడం మొదలైంది. కమలనాధుల తరహాలో మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతలు ఈ విధంగా దేశం కోసం మాట్లాడుతారంటూ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రేపో మాపో వీఎస్ఆర్‌కు కీలక పదవి అందుకోవడం ఖాయమని అంటున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×