E-Paper
Advertisement

Indian Cricketers Salary: రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. టీమిండియా ప్లేయర్లకు ఎంత జీతం వస్తుంది?

Indian Cricketers Salary: రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. టీమిండియా ప్లేయర్లకు ఎంత జీతం వస్తుంది?
Advertisement

Indian Cricketers Salary: రంజి ట్రోఫీ మొదటి దశ 2024 సంవత్సరం చివరలో జరగగా.. 2025 జనవరి 23 నుండి రంజీ ట్రోఫి రెండవ అర్థ భాగం ప్రారంభం అయింది. దేశవాళి క్రికెట్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, యశస్వి జైష్వాల్, గిల్, శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, శివం దుబే.. ఇలా చాలామంది ఆటగాళ్ల ప్రదర్శనలు చూస్తున్నాం. జనవరి 30 నుండి విరాట్ కోహ్లీ కూడా ఇందులో భాగం కానున్నాడు.

Also Read: Shardul Thakur: టీమిండియాలో మరో డేంజర్ ఆలౌ రౌండర్.. 8వ స్థానంలో సెంచరీలు ?

Advertisement

అయితే ఇందులో చాలామంది సీనియర్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. రంజీల్లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. చాలాకాలం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు వచ్చిన ఈ ప్లేయర్స్ తమ తమ సొంత జట్లకు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే.. రంజి ట్రోఫీ రెడ్ బాల్ క్రికెట్ లో కీలక టోర్నమెంట్ గా పరిగణిస్తారు. బీసీసీఐ కూడా ప్రతి ఆటగాడు రంజీ ట్రోఫీలలో పాల్గొనాలని నొక్కి చెప్పింది. అయితే రంజీ ట్రోఫీలలో పాల్గొనే ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కి ఎంత సంపాదిస్తారో తెలుసా..?

టీమ్ ఇండియాకు ఆడే ప్లేయర్స్ వార్షిక కాంట్రాక్టుల రూపంలో కోట్ల రూపాయల జీతం అందుకుంటారు. ఇది కాకుండా మ్యాచ్ ఫీజు తీసుకుంటారు. అయితే రంజీ ట్రోఫీలో ఆటగాళ్లు మ్యాచ్ రోజు ఆధారంగా డబ్బు సంపాదిస్తారు. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ లు సాధారణంగా నాలుగు రోజులపాటు జరుగుతాయి. అలాగే నాకౌట్ మ్యాచ్ లు టెస్ట్ మ్యాచ్ ల మాదిరిగా ఐదు రోజులపాటు జరుగుతాయి. ఈ రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్స్ వారి అనుభవాన్ని బట్టి వేరువేరుగా రోజువారి జీతాలను పొందుతారు.

Advertisement

అంతేకాకుండా ఈ టోర్నీలో ఆడడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆటగాళ్లు తమ పాత ఫామ్ ని తిరిగి పొందేందుకు ఈ టోర్నీలు సహాయపడతాయి. అలాగే ఆర్థికంగా కూడా మంచి డబ్బు వచ్చి పడుతుంది. ఈ రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్స్ కి బీసీసీఐ మూడు స్లాబ్ లలో జీతం ఇస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. 41 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ ప్లేయింగ్ ఎలివేన్ లో భాగమైతే రోజుకు రూ. 60 వెలు అందుకుంటారు. ఇలా నాలుగు రోజుల్లో.. అంటే ఒక్క మ్యాచ్ కి రూ. 2.40 లక్షలు సంపాదిస్తారు.

Also Read: Mohammed Shami: షమీకి మళ్లీ గాయం.. ఇంగ్లాండ్ సీరిస్ నుంచే దూరం ?

ఉదాహరణకి రోహిత్ శర్మ నాలుగు రోజుల మ్యాచ్ ఆడినందుకు 2.40 లక్షలు అందుకుంటాడు. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ. 30 వేలు ఇస్తారు. 21 నుండి 40 మ్యాచ్ ల అనుభవం ఉన్న ప్లేయర్స్ రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. అంటే మ్యాచ్ కి రెండు లక్షల వరకు సంపాదిస్తారు. ఈ కేటగిరీకి చెందిన రిజర్వ్ ప్లేయర్స్ రోజుకు 25 వేలు పొందుతారు. ఇక 20 కంటే తక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ. 40 వేలు. అంటే ఒక మ్యాచ్ కి రూ. 1.60 లక్షలు తీసుకుంటారు. రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ. 20 వేలు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×