E-Paper
Advertisement

నమ్మించి ముంచాడు.. 30 మంది కస్టమర్లకు చుక్కలు చూపించిన గ్యాస్ డెలివరీ బాయ్

నమ్మించి ముంచాడు.. 30 మంది కస్టమర్లకు చుక్కలు చూపించిన గ్యాస్ డెలివరీ బాయ్
Advertisement

Vishakhapatnam: విశాఖపట్నం నగరం గాజువాక పరిధిలో ఒక డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. చిన్నగంట్యాడ ప్రాంతంలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాల్సిన అతడు, అందరినీ బురిడీ కొట్టించి ఏకంగా 30 గ్యాస్ సిలిండర్లతో ఉడాయించాడు.

డెలివరీ బాయ్ అప్పారావు తన ప్లాన్‌ను చాలా తెలివిగా అమలు చేశాడు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారుల ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే, అప్పారావు కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘సిలిండర్ బండిలో ఉంది, ఇప్పుడే తెస్తాను’ అని నమ్మబలికి, వారి మొబైల్స్‌కు వచ్చిన ఓటీపీలను ముందుగానే సేకరించాడు. ఇలా సుమారు 30 మంది వినియోగదారుల నుంచి వివరాలు సేకరించి, రికార్డుల్లో డెలివరీ పూర్తయినట్లు చూపించాడు.

Advertisement

కస్టమర్లకు ఓటీపీలు చెప్పినా సిలిండర్లు అందకపోవడంతో వారు ఏజెన్సీని నిలదీశారు. స్టాక్ తనిఖీ చేసిన ఏజెన్సీ నిర్వాహకులు, అప్పారావు 30 నిండు సిలిండర్లతో సహా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీనిపై సదరు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆ సిలిండర్లను ఎక్కడైనా విక్రయించాడా లేక దాచిపెట్టాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్మకంగా పనిచేయాల్సిన వ్యక్తే ఇలా మోసానికి పాల్పడటంతో ఏజెన్సీ నిర్వాహకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×