E-Paper
Advertisement

మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ

మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ
Advertisement

MP Chamala: భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడికి గురై తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తు కంటిచూపు కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ ఉదంతంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలుడిని భువనగిరి ఎంపీ స్వయంగా పరామర్శించారు. చిన్న వయసులో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ.. బాధితుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు.

బాలుడికి అందిన వైద్యంపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. కంటికి సంబంధించిన ప్రాథమిక చికిత్స పూర్తయిన నేపథ్యంలో.. ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడి బాలుడి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను , భవిష్యత్తులో అవసరమయ్యే చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని వైద్య బృందానికి సూచించారు.

Advertisement

ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎంపీ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారితో, బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. ప్రియాంష్‌కు భవిష్యత్తులో అవసరమైన అత్యాధునిక వైద్య సహాయాన్ని బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా ఉచితంగా , మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ యంత్రాంగం బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన ఆదేశించారు.

ఆడుకోవాల్సిన వయసులో కుక్కల దాడి కారణంగా కంటిచూపు కోల్పోవడం వర్ణనాతీతమైన వేదన అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, చిన్నారి కోలుకునే వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Advertisement

Also Read: ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న లవర్స్.. వారికి గుడి కట్టి పెళ్లి చేస్తున్న గ్రామస్తులు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×