E-Paper
Advertisement

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!
Advertisement

Visakhapatnam: స్నేహితుల దినోత్సవం రోజున ఆనందంగా గడపాలని భావించిన ఆ స్నేహితుల గుంపులో ఊహించని విషాదం నిండింది. సరదాగా గడపడానికి బీచ్‌కి వెళ్లిన ఐదుగురు మిత్రుల్లో ఇద్దరు సముద్ర అలల తాకిడికి గల్లంతయ్యారు.

తీరంలో విషాద ఛాయలు

Advertisement

విశాఖపట్నం పెద జాలారిపేటకు చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఆదివారం పెదగంట్యాడ మండలం పరిధిలోని పాత గంగవరం బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ వారంతా కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీతూ అనే యువతి అలల ఉద్ధృతికి సముద్రంలో పడిపోయింది. నీతూను కాపాడేందుకు రాము అనే యువకుడు వెంటనే నీటిలోకి దిగాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు

Advertisement

తోటి మిత్రులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన నీతూ, రాము కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసు సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ రోజున ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది.

Also Read: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

Tags

Related News

ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసిన మహిళ, అసలు విషయం తెలిస్తే షాక్, అనంతలో దారుణం

భోగాపురం ఈవెంట్.. నా మనసును తాకింది, నోరు విప్పిన సీఎం చంద్రబాబు

పోలవరం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం.. ఆ 4 రాష్ట్రాల సరిహద్దులు బంద్!

తెలుగులో అదరగొట్టిన మోదీ.. భోగాపురం, ఏపీ అభివృద్ధిపై ప్రశంసల జల్లు!

ప్రధానిని తిడుతుంటే.. చాలా బాధపడ్డా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం!

ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్‌పోర్ట్.. చంద్రబాబు మాస్ కౌంటర్

Big Stories

Advertisement
×