E-Paper
Advertisement

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?
Advertisement

Vivekananda Case: వివేకానంద కేసు కొత్త మలుపు తిరుగుతోందా? ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వస్తుందా? అవినాష్‌రెడ్డికి కష్టాలు పొంచి ఉన్నాయా? సుప్రీంకోర్టు తీర్పుతో సునీత మళ్లీ పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమైంది. కింది కోర్టు టైమ్ బాండ్ విధించి ఈసారి విచారణకు ఆదేశిస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సునీత రెండు వారాల్లో పూర్తి వివరాలతో సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లోపు ట్రయల్‌ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Advertisement

సునీత ప్రస్తావించబోయే అంశాలు బట్టి మళ్లీ సీబీఐ దర్యాప్తు కొనసాగించాలా? లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తే అవినాష్‌రెడ్డి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈసారి అరెస్టు నుంచి ఆయన్ని ఎవరూ కాపాడలేరని అంటున్నారు. సునీత బాధిత కుటుంబం కావడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు రావచ్చని సునీత మద్దతుదారుల మాట.

వివేకానంద కేసులో మళ్లీ సీబీఐ దర్యాప్తు అవసరమా? లేదా అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం సుప్రీంకోర్టులో సీబీఐ వివరణ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశిస్తే విచారణ చేసేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. సునీత పిటిషన్‌పై మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది న్యాయస్థానం. ఈ క్రమంలో సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధలుథ్రా తన వాదనలు వినిపించారు.

Advertisement

ALSO READ: ఏపీలో సందడే సందడి.. ఇళ్లు కట్టుకునేవారికి ఇక పండగే

ఘటనకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి అందజేశారు. నిందితులకు బెయిల్ రద్దుతోపాటు మళ్లీ దర్యాప్తు కోరుతున్నట్లు అడ్వకేట్ వివరించారు. ఈ క్రమంలో సునీత లాయర్‌కు న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. మీ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు ముందుకు సాగదన్నారు. ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుందని వ్యాఖ్యానించారు.

ఈ కేసు విచారణ ఆరునెలల్లో ముగిస్తే తాము ఏదో ఒకటి ఆలోచిస్తామన్నారు. చివరకు ఈ కేసు దర్యాప్తు సాగాలా? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం మళ్లీ సీబీఐ కోర్టుకి అప్పగించింది. పిటిషన్ వేయడానికి రెండువారాలు, దానిపై నిర్ణయం చెప్పడానికి న్యాయస్థానానికి ఎనిమిది వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీని తర్వాత అవినాష్ రెడ్డితోపాటు పలువురు నిందితుల బెయిల్ రద్దు  పిటిషన్లపై అప్పుడు విచారణ చేస్తామని పేర్కొంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×