ACB Raids: విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సాధారణంగా హోంగార్డు స్థాయి ఉద్యోగికి వచ్చే ఆదాయానికి.. ఈయన దగ్గర లభ్యమైన ఆస్తులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్కు గురయ్యారు. విజయనగరం, విశాఖపట్నం, గుర్ల ప్రాంతాల్లోని ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.
శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే పనిచేయడం గమనార్హం. ఆ సమయంలో అధికారులు ఎవరిపై దాడులు చేయబోతున్నారు, ఎక్కడ సోదాలు జరగనున్నాయి అనే అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన ముందుగానే తెలుసుకునేవారు. ఈ సమాచారాన్ని సంబంధిత అవినీతి అధికారులకు చేరవేసి.. వారి నుంచి భారీ మొత్తంలో ప్రతిఫలం పొందేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లాది రూపాయల సంపదను వెనకేశాడు.
శ్రీనివాసరావుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. గతంలోనే అతడిని ఏసీబీ విభాగం నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిపిన సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో విలాసవంతమైన భవనాలు, భూములు, నగదు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన పోలీస్ శాఖలోని ఇతర సిబ్బందిని విస్మయానికి గురిచేయడమే కాకుండా, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ ఆస్తుల వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
ALSO READ:ఆఫీస్ ట్రిప్లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్
హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు
శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతాల్లోని అతని నివాసాల్లో తనిఖీలు
దాదాపు రూ.20 కోట్ల అక్రమ ఆస్తులు… pic.twitter.com/iY5x4qOPoS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026