E-Paper
Advertisement

ACB Raids: ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే కన్నం వేసిన ‘కిలాడీ’ హోంగార్డు!

ACB Raids: ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే కన్నం వేసిన ‘కిలాడీ’ హోంగార్డు!
Advertisement

ACB Raids: విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సాధారణంగా హోంగార్డు స్థాయి ఉద్యోగికి వచ్చే ఆదాయానికి.. ఈయన దగ్గర లభ్యమైన ఆస్తులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. విజయనగరం, విశాఖపట్నం, గుర్ల ప్రాంతాల్లోని ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.

శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే పనిచేయడం గమనార్హం. ఆ సమయంలో అధికారులు ఎవరిపై దాడులు చేయబోతున్నారు, ఎక్కడ సోదాలు జరగనున్నాయి అనే అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన ముందుగానే తెలుసుకునేవారు. ఈ సమాచారాన్ని సంబంధిత అవినీతి అధికారులకు చేరవేసి.. వారి నుంచి భారీ మొత్తంలో ప్రతిఫలం పొందేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లాది రూపాయల సంపదను వెనకేశాడు.

Advertisement

శ్రీనివాసరావుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. గతంలోనే అతడిని ఏసీబీ విభాగం నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిపిన సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో విలాసవంతమైన భవనాలు, భూములు, నగదు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన పోలీస్ శాఖలోని ఇతర సిబ్బందిని విస్మయానికి గురిచేయడమే కాకుండా, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ ఆస్తుల వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

ALSO READ:ఆఫీస్ ట్రిప్‌లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×