E-Paper
Advertisement

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!
Advertisement

జగన్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉంది. వైసీపీ హయాంలో తిరుమలను అపవిత్రం చేసే కార్యక్రమాలు చాలా జరిగాయనే ఆరోపణలున్నాయి. తాడేపల్లిలో తిరుమల గుడి సెట్టింగ్ వేసిన జగన్ హిందువులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించారనే ప్రచారం కూడా ఉంది. దేవుడి దగ్గరకు తాను వెళ్లాలి కానీ, తన దగ్గరకే దేవుడ్ని తీసుకు రావడం తగదన్నారు చాలామంది. అధికారం కోల్పోయి తర్వాత కూడా జగన్ లో పెద్దగా మార్పేమీ కనపడ్డం లేదని విమర్శిస్తోంది ఆయన వైరివర్గం. కనీసం పండగలు, పబ్బాలకయినా ఆయన దేవుళ్లను ధ్యానించేందుకు ఇష్టపడటం లేదని వారు అంటున్నారు. దీనికి తగ్గట్టే జగన్ ప్రవర్తన కూడా ఉండటం ఇక్కడ విశేషం. జగన్ మతం ఏదయినా కావొచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అన్ని మతాలను గౌరవించాలి, ఆదరించాలనేది ప్రజల వాదన. కనీసం పార్టీ ఆఫీస్ లో జరిగిన విజయదశమి వేడుకలకు కూడా జగన్ రాలేదంటే ఆయనకు హిందూ పండగలపై ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏదో తూతూమంత్రంగా పార్టీ ఆఫీస్ లో దేవుళ్ల పటాలకు దండలు వేసి దండం పెట్డుటారు వైసీపీ నేతలు. జగన్ మాత్రం యదావిధిగా కేరాఫ్ బెంగళూరు.

Advertisement

తిరుమల విషయంలో జగన్ కి నెగెటివ్ మార్కులు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు, రథాలు తగలబడటం ఇలాంటి ఘటనలు వరుసగా జరిగాయి. దాన్ని కవర్ చేసుకోడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరవడం ఆనవాయితీ. కానీ జగన్ ఏనాడూ ఆ పని చేయలేదు. మిగతా నేతల విషయంలో ఎవరూ ఆక్షేపించరు కానీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని పాటించకపోవడం మాత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కొండపై అప్పటి టీటీడీ ఈవో భార్య జగన్ రెడ్డి రక్షకా గోవిందా అంటూ నినాదాలు చేసినప్పుడు కూడా చాలామంది నొచ్చుకున్నారు. మొత్తంగా కొండపై జగన్ హయాంలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి.

అధికారం కోల్పోయాకా అంతే
2024లో కూటమి అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కూడా జగన్ లో పెద్దగా మార్పేమీ రాలేదని అంటున్నారు. ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా మారలేదనే వాదన వినపడుతోంది. టీటీడీ ఈవోగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తాజాగా అలిపిరి వద్ద శని దేవుడి విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని మొదలు పెట్టిన రగడ మరోసారి సంచలనంగా మారింది. శనిదేవుడికి, తిరుమల శ్రీవారికి తేడా తేలియని వ్యక్తి టీటీడీ ఈవోగా పనిచేశారా అనే చర్చ మొదలైంది. అలాంటి వారికి జగన్ టీటీడీ ఈవో పదవి ఇచ్చారా అనే విమర్శలు వచ్చాయి. ఒక్క తిరుమల విషయంలోనే కాదు, హిందువుల మనోభావాలను అడుగడుగునా వైసీపీ దెబ్బతీసిందని వైరి వర్గాలు ఆటాడేసుకుంటున్నాయి.

Advertisement

Also Read: దేవరగట్టు కర్రల సమరంలో ముగ్గురు మృతి

జగన్ ఏం చేయాలి?
జగన్ నటించాల్సిన పనిలేదని, హిందూ ధర్మ పరిరక్షకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు జనం. కానీ హిందూ మతాన్ని గౌరవించడం, హిందూ పండగలకు కూడా హాజరవడం అత్యవసరం అనే వాదన వినపడుతోంది. ఆ విషయంలో ఆయన తనని తాను మార్చుకోకపోతే, ప్రజల దృష్టిలో హిందూ ద్వేషిగానే మిగిలిపోతారని అంటున్నారు. ప్రత్యర్థుల చేతికి తనకు తానే ఆ ఆయుధాన్ని ఇచ్చినవారవుతారు.

Also Read: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం..

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×