E-Paper
Advertisement

JC Prabhakar Reddy: న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: న్యాయం చేయకపోతే  కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement

JC Prabhakar Reddy: వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని తాడిపత్రి మున్సిపల్ చేర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్సుల కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపించిందని ఆరోపించారు. పది రోజుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయం, డీసీపీ ఆఫీస్ ఎదుట తన కుటుంబ సభ్యుతో కలిసి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

జేసీ ట్రావెల్స్‌పై తప్పుడు కేసులు పెటారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్‌పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పది రోజుల్లో న్యాయం జరగాలని అన్నారు. తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగల మాదిరిగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Advertisement

Also Read: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు

2017 ఏప్రిల్1 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని పలు రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పు ఇచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏపీని చెడ గొట్టింది ఐఏఎస్, ఐపీఎస్ లేనని ఆరోపించారు. రవాణా శాఖ అధికారులు అంతా అవినీతి పరులే అని అన్నారు. తన బస్సులను అన్నింటినీ ట్రాన్స్ పోర్టు అధికారులు రిపేర్ చేయించి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పరువు తీసి బయట తిరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×