E-Paper
Advertisement

Viral: తిరుమలలో యువతిపై విరిగిపడిన చెట్టుకొమ్మ.. తీవ్రగాయాలతో హాస్పిటల్‌కు

Viral: తిరుమలలో యువతిపై విరిగిపడిన చెట్టుకొమ్మ.. తీవ్రగాయాలతో హాస్పిటల్‌కు
Advertisement

Tirumala Hill: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం వేలాది లేదా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. నిత్యం కొండ మీదికి భక్తులు వస్తూనే ఉంటారు. తిరుపతికి వెళ్లాక కేవలం శ్రీవారి దర్శనంతో సరిపెట్టుకోకుండా చుట్టుపక్కల ఉన్న ఇతర దైవ క్షేత్రాలను కూడా దర్శించి మొక్కులు సమర్పించుకుంటారు. ఇలాగే ఓ యువతి తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్లుతుండగా తీవ్ర ప్రమాదానికి గురైంది.

దర్శనం కోసం వెళ్లుతుండగా.. ఆలయ ముఖ ద్వారానికి సమీపానికి వచ్చాక హఠాత్తుగా ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి ఆమె పై పడింది. ఆ కొమ్మ నేరుగా ఆమె తలపై పడింది. దీంతో క్షణాల్లోనే ఆమె నేలపై కూలపడిపోయింది. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. ఆమె భక్తిలో దైవ దర్శనానికి వెళ్లుతుండగా మార్గమధ్యంలోనే పైనుంచి పెద్ద కొమ్మ వచ్చి పడటం అందరినీ ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ఘటనను తోటి భక్తులు వీడియో తీశారు.

Advertisement

ఈ దెబ్బతో సదరు యువతికి తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నది. ఆమె వివరాలు ఏమిటన్నవి ఇంకా తెలియరాలేవు. అయితే, భీతి గొల్పుతున్న ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Advertisement

ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన చర్య అని పేర్కొంటుండగా.. ఆలయ దేవస్థానం మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది ఆమె క్షేమాన్ని కోరుతూ కామెంట్లు చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×