E-Paper
Advertisement

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో
Advertisement

Kakinada District: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తేటగుంట జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఒక యువకుడు లారీ కింద పడిపోయినా, అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోనే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాలు..
సోమవారం.. మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో తేటగుంట జాతీయ రహదారిపై ఒక క్రషర్ మిల్లర్ లారీ రోడ్డుకు పక్కకు తిరిగే ప్రయత్నంలో ఉంది. ఈ సమయంలో అనకాపల్లి జిల్లా అరట్లకోట గ్రామానికి చెందిన 28 ఏళ్ల నరేంద్ర అనే యువకుడు తన బైక్‌పై వేగంగా వస్తున్నాడు. అతడు లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించా, లారీ ఎదురు భాగం అతని బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి నరేంద్ర రోడ్డుపై పడిపోయాడు. తర్వాత లారీ అతని శరీరం పైనుంచి నాలుగు చక్రాలతో వెళ్ళిపోయింది. కానీ, నరేంద్ర అద్భుతంగా తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. అతను కొంచెం పక్కకు తల పెడితే అతని తల భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యేది.. అతడు కింద పడిన వెంటనే లేచి కూర్చుని, చుట్టూ చూస్తూ లేచి నడిచాడు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు మొదట భయపడ్డారు, తర్వాత అతడు సురక్షితంగా ఉన్నట్టు తెలిసి సంతోషించారు.

Advertisement

నరేంద్ర అరట్లకోట గ్రామంలోనే ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి, సంబరాలు, ఇతర కార్యక్రమాల కవరేజ్ చేసి జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు కూడా ఒక పెళ్లి కవరేజ్ పని కోసం అనకాపల్లి నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి కుటుంబం ఈ ఘటన తెలిసిన తర్వాత భయబ్రాంతుల్లో పడింది. ప్రమాదం తర్వాత అతడు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, త్వరలోనే డిశ్చార్జ్ అవుతానని చెబుతున్నాడు.

Also Read: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

Advertisement

తేటగుంట పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్‌పై కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. డ్రైవర్‌కు ఆల్కహాల్ ప్రభావం లేదని, కానీ సిగ్నల్ లేని జంక్షన్‌లో పక్కకు తిరగడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులు డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓవర్‌టేక్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, జంక్షన్‌లలో వేగం తగ్గించాలని హెచ్చరించారు.

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×