BigTV English
Advertisement

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

YCP Leaders Target on Pawan Kalyan in Social Media: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేసింది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నారా అంటూ పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీసుకి 82 లక్షల 14 వేలు ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుధ్య, సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం 82 లక్షల 14 వేల 471 రూపాయలను మంజూరు చేసింది.

అసలు విషయానికి వస్తే.. ఈ ఏడాది జూన్ 12న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్.. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు.


Also Read: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలో.. పవన్ కేవలం మూడు రోజుల పాటు క్యాంప్ కార్యాలయంలో ఉన్నారని.. నెలకు రూ.9,12,719 చొప్పున.. తొమ్మిది నెలలకు ప్రభుత్వం 82 లక్షల 14 వేల 471 రూపాయలను మంజూరు చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుధ్య పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తోంది.

అయితే గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82 లక్షల 14 వేలు మంజూరు చేసినప్పటికీ.. అవి కేవలం పారిశుధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన ఆఫీసుకి ఒక్క రూపాయి కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యిందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×