E-Paper
Advertisement

YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం

YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం

YS Sharmila: ఉత్తరాది రాష్ట్రాల్లో పకృతి విలయాలకు జాతీయ విపత్తుగా ప్రకటించుకునే ప్రధానీ మోదీ మాత్రం.. ఏపీపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు.

మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే.. తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

మొంథా తుఫాన్ రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని, ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని, 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టం ఇది వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత పెద్ద విపత్తు సంభవించినా చంద్రబాబు మౌనంగా ఉండటం సిగ్గుచేటు. 20 లక్షల ఎకరాలు పంట నష్టపోయిన పరిస్థితుల్లో కేవలం 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని చెప్పడం రైతులను మోసం చేయడమే.

మోదీ చేసిన మోసాల్ని ఇన్నాళ్లు భరించాం. కానీ రైతులు ఆపదలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం చంద్రబాబుకి తగదు. ఇప్పుడైనా వెన్నుముక లాంటి రైతులకు అండగా నిలబడి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం తీసుకురావడం సీఎం ధర్మం” అని షర్మిల వ్యాఖ్యానించారు.

Also Read: ఆంధ్రా అడవులకు మరో అతిథి.. రేపో మాపో అడవి దున్నలు రాక!

వెన్నుముక లాంటి రైతన్నకు అండగా నిలబడే సమయం ఇది. పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమే. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే. మోదీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు .. ఇప్పుడైనా నోరు విప్పండి. జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయండి. జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురండి. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×