E-Paper
Advertisement

Mahabubabad: మార్చురీలో ఒక్కసారిగా కదిలిన శవం.. హడలిపోయిన సిబ్బంది.. అసలు ఏమైందంటే?

Mahabubabad: మార్చురీలో ఒక్కసారిగా కదిలిన శవం.. హడలిపోయిన సిబ్బంది.. అసలు ఏమైందంటే?
Advertisement

Mahabubabad:  ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైద్యుల, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. సాధారణంగా చనిపోయిన వారిని మార్చురీలో పెడతారు. కానీ బతికున్న మనిషినే మార్చురీలో పెట్టి వార్తల్లోకి ఎక్కారు ఆ ఆసుపత్రి సిబ్బంది. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మనిషి బతికి ఉండగానే మార్చురీలో భద్రపరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనలో 3 రోజుల క్రితం చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వచ్చాడు. పేషంట్ కు అటెండర్ లేడని, ఆధార్ కార్డు లేదని అడ్మిట్ వైద్య సిబ్బంది చేసుకొలేదు. గుర్తు తెలియని శవమని భావించిన వైద్య సిబ్బంది.. రాత్రి అంతా మార్చురీలోనే పెట్టి తాళం వేశారు.  ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా గమనించిన స్వీపర్.. వెంటనే సూపర్ వైజర్ రాజుకు సమాచారం అందించగా,అతను పోలీస్ ఔట్ పోస్ట్ లో డ్యూటిలో ఉన్న పోలీస్ కు సమాచారం ఇచ్చాడు. ఔట్ పోస్ట్ పోలీస్ ఉద్యోగి ,పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా టౌన్ ఎస్సై వచ్చి ,మార్చురీ నుండి ఆ వ్యక్తి ని బయటకు తీసుకవచ్చి AMCలో అడ్మిట్ చేయించి రికార్డులో నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Read Also: CM Revanth Reddy: తుపాను బాధితులను ఆదుకోవడంలో అన్ని రకాలుగా సిద్ధం.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆస్పత్రిలో మహిళ కళ్ళు తిరిగి పడిపోయిన కనీసం సిబ్బంది మానవత్వం కూడా చూపలేదని ఆరోపించారు.  అడ్మిట్ రికార్డు, డేత్ రికార్డు ఇవ్వడానికి వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

Big Stories

Advertisement
×