BigTV English
Advertisement

YS Jagan: అభిషేక్ రెడ్డికి అంత్యక్రియలు, పులివెందులలో జగన్ దంపతులు, రచ్చ‌కు నో ఫుల్‌స్టాప్

YS Jagan: అభిషేక్ రెడ్డికి అంత్యక్రియలు, పులివెందులలో జగన్ దంపతులు, రచ్చ‌కు నో ఫుల్‌స్టాప్

YS Jagan: మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి అనారోగ్య కారణంగా మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శనివారం తెల్లవారుజామున పులివెందులకు ఆయన పార్థివదేహం చేరింది. అంత్యక్రియలు శనివారం (ఇవాళ) పులివెందులలో జరుగుతున్నాయి.


ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న జగన్ దంపతులు ఉదయం 10 గంటలకు పులివెందులకు వెళ్లారు. అనంతరం అభిషేక్ రెడ్డి పార్దివ దేహానికి నివాళులర్పించారు జగన్ కుటుంబ సభ్యులు. తిరిగి నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు వెళ్ళనున్నారు.

తమ రాజకీయ ఎదుగుదలకు ఎంతో పాటు పడ్డారని, వైయస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు అభిషేక్ రెడ్డి పార్ధవ దేహానికి నివాళులర్పించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి.


నాలుగు రోజు కిందట అభిషేక్‌రెడ్డి చనిపోయారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆసుపత్రి వర్గాలు గానీ, ఇటు వైఎస్ ఫ్యామిలీ సభ్యులు నోరు విప్పలేదు. అందరూ సైలెంట్ అయ్యారు. దీనిపై మీడియాతోపాటు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరిగాయి. చివకు శనివారం అంత్యక్రియలని వైసీపీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెల్సిందే.

ALSO READ: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..

ఇక అభిషేక్ విషయంలో జగన్ వ్యవహారశైలిపై చాలామంది సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. బంధువు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా, ఒక్కసారి హైదరాబాద్ వెళ్లి ఆయనను కలిసిన సందర్భం లేదన్నారు.

రాజకీయంగా అందర్ని ఉపయోగించుకుని ఆ తర్వాత బయటకు పంపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా వర్ణించారు. అభిషేక్ మాత్రమే కాదు విజయమ్మ, షర్మిలను సైతం అదే విధంగా చేశారని అంటున్నారు. జగన్‌పై ఇంతలా ఇంటా బయటా ప్రచారం వ్యతిరేకంగా జరుగుతున్నా మౌనంగానే ఉండిపోయారాయన.

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×