BigTV English

Andhra Pradesh : ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Andhra Pradesh : ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Andhra Pradesh : ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం జగన్‌. ఈ మేరకు ఇన్‌చార్జ్‌లను మార్చే ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలను మార్చడంతో నేతల్లో టెన్షన్‌ పట్టుకుంది. ఎవరిని ఉంచుతారో.. ఎవరిని ఊడబీకుతారోనన్న గుబులు మొదలైంది.


ఈ మేరకు విశాఖ వైసీపీ నేతలు టెన్షన్‌లో ఉన్నారు. విశాఖ జిల్లా అరకు, పాడేరు, అనకాపల్లి, పాయకరావుపేటలో మార్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇచ్ఛాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, చోడవరంపై కూడా కసరత్తు చేస్తోంది వైసీపీ.

అరకులో ఎంపీ మాధవి, పసుపులేటి బాలాజీ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పాడేరుకు విశ్వేశ్వర్‌రాజు, అనకాపల్లిలో బుడేటి సత్యవతి లేదా దాడి రత్నాకర్‌ను నియమించే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో మంత్రి అమర్‌నాథ్‌ను బరిలో దించే యోచనలో ఉంది. ఇచ్ఛాపురం ఇన్‌ఛార్జ్‌గా బీసీ వర్గానికి అవకాశమిచ్చే ఛాన్స్‌ ఉంది. పాతపట్నంలో రెడ్డి శాంతిని మార్చుతారని ప్రచారం సాగుతోంది.


అలాగే ఎచ్చెర్లలో చిన్న శ్రీను, బెల్లం చంద్రశేఖర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక చోడవరంలోనూ కొత్త ఇన్‌చార్జ్‌ నియామకానికి కసరత్తు చేస్తుండగా.. పాయకరావుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్ల బాబురావును మార్చే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×