E-Paper
Advertisement

YS Sharmila: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి.. బుడమేరు ఆక్రమణలు తొలగించాలి: షర్మిల

YS Sharmila: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి.. బుడమేరు ఆక్రమణలు తొలగించాలి: షర్మిల
Advertisement

YS Sharmila Visited Flood affected areas: భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వరదలు పూర్తిగా మంచెత్తాయి. దీంతో వారు సర్వం కోల్పోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో గురువారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఆదుకోవాలి. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమని ఆమె పేర్కొన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరిగా, బుడమేరు ఆక్రమణలు తొలగించాలంటూ కూటమి ప్రభుత్వానికి ఆమె సూచించారు.

Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?

Advertisement

‘కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయ్యింది. బుడమేర వల్లే విజయవాడలో వరదలు వచ్చాయి. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం చంద్రబాబుపై ఉంది. బుడమేరుకు రిటర్నింగ్ వాల్ ను నిర్మించాలి. వరదల్లో ఇప్పటివరకు 35 మంది మృతిచెందారు. 5 లక్షల మంది నష్టపోయారు. ఇది ఘోర విపత్తు. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించకపోవడం ఎంత వరకు కరెక్ట్? విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడంలేదా? ఇక్కడి ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యాననే సంగతి మరిచారు. ఏపీ ప్రజల కష్టాలు మోదీకి కనిపిచడంలేదు. కేంద్రం వెంటనే స్పందించి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం రూ. లక్ష సాయం అందించాలి’ అంటూ ఆమె డిమాండ్ చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×