E-Paper
Advertisement

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!
Advertisement

YS Sharmila: గోదావరి వరదలతో వందలాది గ్రామాలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం బాధితులను పట్టించుకోకుండా ప్రధాని మోదీ భజనలోనే నిమగ్నమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని పొగడటానికి ఉన్న ఆసక్తి.. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో చూపకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని కోసం కన్నీళ్లు.. ప్రజల గోస కనపడదా?

Advertisement

గోదావరి ఉగ్రరూపంతో దాదాపు 100 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 20 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు ఊళ్లు నీట మునుగుతుంటే తక్షణ పునరావాసం కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘మోదీ తిడితే కంట కన్నీరు పెట్టుకునే నాయకులకు, ఇళ్లు ఖాళీ చేసి తట్టా బుట్ట పట్టుకుని వెళ్తున్న నిర్వాసితుల కన్నీటి గోడు ఎందుకు వినపడటం లేదు?’ అని ఆమె నిలదీశారు. వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్లు..

Advertisement

ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పలు డిమాండ్లు చేశారు.

బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో నాణ్యమైన భోజనం, తాగునీరు అందించడంతో పాటు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావంతో అనారోగ్యాల బారిన పడేవారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని.. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏటా ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చెల్లించి, వారిని సురక్షిత ప్రాంతాల్లో శాశ్వతంగా పునరావాసం కల్పించాలని తెలిపారు.అదే విధంగా వరద ఉధృతి తగ్గే వరకు ప్రభుత్వం ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి భరోసా అందించాలని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Also Read: ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి

Tags

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×