E-Paper
Advertisement

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?
Advertisement

Anilkumar, Jogi ramesh: చేసిన పాపాలు ఏదోరూపంలో వెంటాడుతాయని తరచు పెద్దలు చెప్పే మాట. అధికారం ఉన్నా.. లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండాలని తలపండిన సీనియర్ రాజకీయ నేతల మాట. అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. అధికారం పోయాక నేతల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. లేటెస్ట్‌గా వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు జనసేన‌లోకి వెళ్లేందుకు మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్ పార్టీలో ఉక్కుపోత మొదలైందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతలకు మింగుడు పడడం లేదా? వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని భావిస్తున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో తమకు పరిచయాలున్న వేరే పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రులిద్దరు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకరు నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కాగా, మరొకరు కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్.

కొద్దిరోజుల కిందట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆయన రిలాక్స్ అవుతున్నారట. వైసీపీలో ఉన్నప్పుడు ఎటువైపు పోలీసులు వస్తారేమోనని భయంతో బెంబేలెత్తేవారట. సింపుల్‌గా చెప్పాలంటే సామినేని  ప్రశాంతంగా ఉన్నారని ఆయన మద్దతుదారుల మాట.

Advertisement

వైసీపీలో ఇబ్బందిపడుతున్న నేతలతో  సామినేని మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వారిలో అనిల్ కుమార్, జోగి రమేష్‌లతో  చర్చలు జరిపారట. ఒకవేళ పార్టీలోకి వస్తారంటే అధినేతతో మాట్లాడుతానని చెప్పారట. దీంతో మాజీమంత్రలు ఆలోచనలో పడినట్టు జనసేన పార్టీ వర్గాల మాట. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా నేతలు రావడం ఖాయమని గ్లాసు పార్టీలో చిన్నపాటి చర్చ.

ALSO READ: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

మాజీ మంత్రి జోగి రమేష్‌ ప్రస్తుతం కేసుల చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసుతోపాటు మరికొన్నింటిని ఎదుర్కొంటున్నారు. వాటిని నుంచి బయట పడాలంటే వైసీపీలో ఉంటే కష్టమని భావిస్తున్నారట. ఈ క్రమంలో తన అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకున్నారట.

నెల్లూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు ముదిరిపాకాన పడింది. అనిల్‌కుమార్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారట. అలాగని వైసీపీ తరపున గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. ఆయనను పార్టీ దాదాపుగా సైడున పెట్టిందనే టాక్ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడమే ఉత్తమమని భావిస్తున్నారట అనిల్.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×