BigTV English

Sailajanath: అన్నా-చెల్లి మధ్య వివాదం.. అందుకే వైసీపీలో చేరా

Sailajanath: అన్నా-చెల్లి మధ్య వివాదం.. అందుకే వైసీపీలో చేరా

Sailajanath: ఎన్డీయే కూటమి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఎన్డీయే ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి ఆగడాలను ఎదుర్కొనేందుకు వైసీపీలో చేరానని తెలిపారు. వైసీపీలో చేరిన తరువాత తొలిసారి అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చారాయన.


వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబమన్నా తనకు ఆరాధన భావం ఉందన్నారు శైలజనాథ్. అధినేత జగన్-చెల్లెలు షర్మిల మధ్య జరుగుతున్న వివాదం త్వరలో ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం , శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలన్నారు. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా డిప్యూటీ సీఎం ఏపీలో ఉండి ప్రజల పక్షాన నిలబడాలని సూచన చేశారు మాజీ మంత్రి. సూపర్ సిక్స్ హామీలను చూసి మీకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. హామీలు ఇచ్చేటప్పుడు అమలు చేయలేమని సీఎం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.


ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడానికి ముఖ్యమంత్రి మనసుకు కష్టంగా ఉంటుందని తనకు అనిపిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో క్షమాపణలు చెబితే సరిపోదని, శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు జరుగుతుందన్నారు. శైలజానాథ్‌ని ఆహ్వానించారు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి,ఆలూరు సాంబశివారెడ్డి. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులకు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

ALSO READ:  బద్దలవుతున్న పులివెందుల కోట.. జగన్‌కు బిగ్ షాక్

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×