E-Paper
Advertisement

Mp Ayodhya Rami Reddy: క్లారిటీ ఇచ్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య

Mp Ayodhya Rami Reddy:  క్లారిటీ ఇచ్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య
Advertisement

Mp Ayodhya Rami Reddy: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి పోతుందని ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పిన మాట. అక్షరాలా నిజం అవుతోంది. ఒకప్పుడు ఇదే స్ట్రాటజీని ఎత్తుకున్న కొన్ని పార్టీలు ఇప్పుడు అదే ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజీనామా వ్యవహరం.

రీసెంట్‌గా వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆయన వార్త బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలో ఆ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారంటూ వార్తలు జోరందుకున్నాయి.  దీనిపై మీడియాలో ఒకటే చర్చ. అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న టెన్షన్ ఆ పార్టీ నేతలను వెంటాడింది.

Advertisement

వైసీపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. ఫారెన్ టూర్‌లో ఉన్న ఎంపీ అయోధ్యతో కొన్ని ఛానెళ్లకు ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. తాను ఇండియాకు వచ్చిన తర్వాత అంతా చెబుతానని వెల్లడించారు. ఫారెన్ నుంచి విజయవాడకు చేరుకున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

ఎంపీ వస్తున్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు. లైట్‌గా నవ్వుతూ అదంతా ఫేక్ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన రాజీనామాపై జరుగుతన్న ప్రచారానికి బ్రేక్ పడిందనే చెప్పవచ్చు.

Advertisement

ALSO READ: పదవులపై లోకేష్ క్లారిటీ, రంగంలోకి బాలకృష్ణ

నార్మల్‌గా అయితే వ్యాపారవేత్తలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు తమ టర్న్ ముగిసేవరకు సైలెంట్‌గా తమ పనులు చేసుకుంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత సందర్భాన్ని బట్టి అడుగులు వేయడం చూస్తుంటాము. రాంకీ గ్రూపు యజమాని అయోధ్య రామిరెడ్డికి జగన్‌ అత్యంత సన్నిహితుడు కూడా. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే రేపటి రోజున రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కూడా.

 

Related News

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×