Big Stories

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. అలానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -

కాగా జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజులపాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News