E-Paper
Advertisement

ఇథనాల్‌ ఫ్యూయల్ వద్దట.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

ఇథనాల్‌ ఫ్యూయల్ వద్దట.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

దేశంలో పెట్రోల్‌ లో ఇథనాల్ మిశ్రమాన్ని క్రమంగా పెంచుతున్న ప్రభుత్వం, భవిష్యత్తులో E20 కంటే ఎక్కువ స్థాయిలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజాగా న్యూఢిల్లీలో E85 ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో పలు ప్రముఖ నగరాల్లో ఈ ఫ్యూయెల్ ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. అయితే, ఈ నిర్ణయంపై వాహనదారుల్లో పెద్ద ఎత్తున సందేహాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ పోల్ లో ఇదే విషయం వెల్లడైంది.

ఇథనాల్ ఫ్యూయల్ పై ఆందోళన

తాజాగా ఓ ఆటో వెబ్ సైట్ ఇథనాల్ ఇంధనానికి సంబంధించి సర్వే నిర్వహించింది. 3,450 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో, E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ ను ప్రవేశపెట్టడంపై ఎక్కువ మంది వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనాల పనితీరు, ఇంజిన్ దీర్ఘకాలిక స్థితి, మైలేజీ తగ్గుదల లాంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సర్వేలో ఏం తేలిందంటే?

పోల్‌ లో పాల్గొన్న వారిలో 47.5 శాతం మంది తమ వాహనాలకు నష్టం జరిగే అవకాశం ఉందని భావించారు. ఇథనాల్ గాలిలోని తేమను ఆకర్షించే లక్షణం కలిగి ఉండటంతో, ఇంధన వ్యవస్థలోని కొన్ని భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాత E10 వాహనాల యజమానులు ఈ విషయంలో ఎక్కువ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక 23 శాతం మంది ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందనే కారణంతో ఇథనాల్ మిశ్రమం పెంపును వ్యతిరేకించారు. ఇథనాల్‌ లో పెట్రోల్‌ తో పోలిస్తే శక్తి సాంద్రత తక్కువగా ఉండటంతో, వాహనం మైలేజీ కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే E20 ఇంధనంతో కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గినట్లు పరీక్షల్లో గుర్తించబడింది. దీంతో మిశ్రమం మరింత పెరిగితే వినియోగదారుల ఖర్చు కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

మరో 15.21 శాతం మంది మాత్రం ఓ కండీషన్ తో సపోర్టు చేశారు. E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్ ధర తక్కువగా ఉంటే మాత్రమే తాము దానిని ఉపయోగించేందుకు సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం ఇంధన ధరలు అధికంగా ఉండటంతో, ధరల పరంగా ప్రయోజనం ఉంటేనే ఈ మార్పును అంగీకరించగలమని వారు భావిస్తున్నారు.

సపోర్టు చేసిన 11.5 శాతం మంది!

అయితే, కొంతమంది ఇథనాల్ ఫ్యూయల్ కు మద్దతు ఇచ్చారు. సుమారు 11.5 శాతం మంది, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌ ను ఎక్కువగా వినియోగించడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 2.7 శాతం మంది పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం పెరగడం వల్ల వాహనాల నుంచి వెలువడే కొన్ని కాలుష్యకారక ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మొత్తంగా సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతానికి పైగా ప్రజలు E20 కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే, ఎక్కువ ఇథనాల్ ఫ్యూయల్ పై ప్రజల్లో పలు సందేహాలు ఉన్నట్లు ఈ పోల్ స్పష్టం చేసింది.

Read Also: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

Related News

E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఎలా తయారవుతుంది? దీని వల్ల కలిగే లాభాలేంటి?

బాలెనోను వెనక్కి నెట్టిన ఫ్రాంక్స్.. నెక్సా బెస్ట్ సెల్లింగ్ SUVగా రికార్డు!

భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!

బైక్ స్టంట్లకు బ్రేక్.. టూ వీలర్స్ కు 3-లేయర్ సేఫ్టీ సిస్టమ్ వచ్చేస్తోంది!

బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

మే అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. ఏకంగా ఎన్ని లక్షల యూనిట్స్ అమ్మిందంటే?

ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ 7-సీటర్ SUVలు ఇవే!

Big Stories

×