PM Modi: సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ నీట్ విద్యార్ధు, పరీక్షలకోసం ఓ వీడియో పోస్ట్ చేసారు. విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఒకపై జరిగే పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మరియు టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోది వీడియోలో తెలిపారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం స్పష్ట్రం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ రణరంగంగా మారింది. ఈ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్షాలు తమకు లభించిన బలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకోనుటకు ప్రయత్నిస్తుండగా, అధికార బీజేపీ సైతం అంతే దీటుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుంది.
Also Read: ఖమ్మంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!
పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చివరకు తప్పును ఒప్పుకోక తప్పలేదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. రాజీనామాతోనే సరిపెట్టకుండా, విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
మరో వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సోషల్ మీడియా… pic.twitter.com/mHFr5J7egQ
— BigTV APP (@BigtvApp) July 26, 2026
Also read: అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!