E-Paper
Advertisement

రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!

రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!
Advertisement

Man Buys New Bike Uses Rs 10 Coins: సాధారణంగా లక్ష రూపాయలకుపైగా విలువైన బైక్ కొనాలంటే క్యాష్, చెక్ లేదంటే డిజిటల్ పేమెంట్ చేస్తారు. కానీ, ఓ వ్యక్తి అందరికీ భిన్నంగా ఆలోచించాడు. మొత్తం రూ.1.10 లక్షల విలువైన మోటార్‌ సైకిల్‌ ను కేవలం రూ.10 నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  ఈ ఆసక్తికర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొండే రఘుపతి చాలా రోజులుగా ఒక కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నాడు. చివరకు చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్‌ కు వెళ్లి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ కొనుగోలు చేయాలనుకున్నాడు. అయితే, బైక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతడు చేసిన పని షోరూమ్ సిబ్బందినే ఆశ్చర్యపరిచింది.

11 వేల 10 రూపాయాల నాణేలతో కొనుగోలు

మొత్తం రూ.1.10 లక్షల బిల్లును క్యాష్, డిజిటల్ పేమెంట్ ద్వారా కాకుండా, పూర్తిగా రూ.10 నాణేల రూపంలో చెల్లించాడు. అంటే, దాదాపు 11 వేల పది రూపాయల నాణేలను తీసుకొచ్చి షోరూమ్‌ సిబ్బందికి అందజేశాడు. ఇన్ని నాణేలను ఒకేసారి చూసిన సిబ్బంది కూడా కొంతసేపు ఆశ్చర్యపోయారు. నాణేలను లెక్కించడానికి సిబ్బంది చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ, అవన్నీ చెల్లుబాటు అయ్యే కాయిన్స్ కావడంతో షోరూమ్ యాజమాన్యం ఆ డబ్బులను తీసుకున్నాడు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రఘుపతికి కొత్త బైక్‌ ను అందజేశారు.

అన్ని కాయిన్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు?

Advertisement

రఘుపతి ఇంత పెద్ద మొత్తాన్ని నాణేల రూపంలో ఎలా సేకరించాడనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు చాలా కాలంగా పొదుపు చేసిన నాణేలేనని చెబుతుండగా, మరికొందరు వ్యాపార లావాదేవీల్లో వచ్చిన నాణేలను దాచుకున్నాడని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను నాణేలతో కొనుగోలు చేయడం చాలా అరుదైన విషయం కావడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రఘుపతి ఓర్పును ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇన్ని నాణేలను లెక్కించడం షోరూమ్ సిబ్బందికి పెద్ద పరీక్షే అయి ఉంటుందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా పెద్ద మొత్తాల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరుగుతున్న ఈ రోజుల్లో, రూ.10 నాణేలతో లక్ష రూపాయలకుపైగా విలువైన బైక్ కొనుగోలు చేయడం నిజంగా ఆసక్తికరమైన ఘటనగా నిలిచింది. ఈ సంఘటన ప్రస్తుతం తెలంగాణలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతోంది.

Read Also: చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోవచ్చు!

Related News

ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

టాటా పంచ్ కొనేవారికి బ్యాడ్ న్యూస్.. అన్ని వేరియంట్లపై ధరల పెంపు!

అసభ్య ప్రకటనల దుమారం.. క్షమాపణ చెప్పిన చైనా ఈ-బైక్ కంపెనీ!

మీ పాత కారులో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ARAI రిపోర్ట్ ఏం చెప్పిందంటే?

కారు బ్యాటరీ డౌన్ అయినా, టైర్లలో గాలిపోయినా.. ఈ ఒక్క డివైజ్ ఉంటే ఇక నో టెన్షన్!

చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోవచ్చు!

ఇది ఆటోనా.. మినీ బస్సా? బజాజ్ కొత్త డబుల్ డెక్కర్ డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×