Colors Swathi: కలర్స్ షో ద్వారా యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి.. ఈ షోతో కలర్స్ స్వాతిగా పేరు దక్కించుకున్న స్వాతి రెడ్డి..’అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ గా అవతరించింది. తనదైన చమత్కారం, స్పష్టమైన మాటలతో అందరినీ ఆకట్టుకునే ఈ తెలుగమ్మాయి.. గతంలో వివాహం, రిలేషన్షిప్ గురించి బోల్డ్ కామెంట్లు చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని విమర్శలకు చోటు ఇచ్చింది. అయితే ఆ పెళ్లి మూనాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు మరో పెళ్లి చేసుకొని సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . చడీచప్పుడు లేకుండా తన భర్తతో హోమం చేస్తున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన కలర్స్ స్వాతి..’ మంత్ ఆఫ్ మధు’ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ తోనే ఆమె ఏడు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. స్వాతి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి ఫోటోలను పంచుకుంటూ “Hitched “అంటూ మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటిని ట్యాగ్ చేసింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సాదాసీదాగా ఈ వివాహం జరిగినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి అయితే సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
స్వాతి విషయానికి వస్తే.. గతంలో 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. కొంతకాలం విదేశాల్లో కుటుంబ జీవితానికే ప్రాముఖ్యత ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈమె.. మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సమయంలోనే తన తన భర్త నుంచి విభేదాలు వచ్చాయని, విడిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై స్వాతి స్పందించలేదు. ఇకపోతే ఇప్పటివరకు తన మొదటి వివాహం, విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ సడన్ గా రెండో పెళ్లి చేసుకోవడం అందరికీ షాకింగ్ గా మారింది.
ఇదిలా ఉండగా తన తొలి వివాహానికంటే ముందే పెళ్లి విషయంలో బోల్డ్ కామెంట్లు చేసి స్వాతి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తన కెరియర్ తొలినాళ్లలో “పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. ఈరోజుల్లో ఒక మనిషిని నమ్మి, పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండడం చాలా కష్టం. ఎవరికీ ఓపిక లేదు. అందుకే ఎవరినో పెళ్లి చేసుకుని, ప్రతిరోజు మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం బెటర్. అది ఎప్పుడు ఎలాంటి కండిషన్లు లేకుండా నమ్మకంగా మనల్ని ప్రేమిస్తుంది” అంటూ తెలిపింది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత వికాస్ వాసుని ప్రేమించి, పెళ్లి చేసుకొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
also read: అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?