AP Local Polls: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండగా పొలిటికల్ హీట్ వేవ్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. డేంజర్ జోన్లో 40 మంది ఉన్నట్లు సమాచారం. రోజుకి ఐదుగురికి చొప్పున కౌన్సిలింగ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పనితీరు బాగోకపోతే చర్యలు తప్పవని సిగ్నల్స్ కూడా పంపుతున్నారు.
Also Read: ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!
అటు వైఎస్సార్సీపీ కూడా గేమ్ స్పీడ్ చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, సమన్వయకర్తలతో జగన్ మెగా మీటింగ్ పెడుతున్నారు. స్థానిక ఎన్నికలకు రెడీ కావాలని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. స్ట్రాటజీకు కూడా చెప్పనున్నారు. ఈ లోకల్ ఎన్నికల్లో వైసీపీ కంటే కూటమికే ఎక్కువ సవాళ్లు కనిపిస్తున్నాయ్. సీట్ల పంపకం, క్యాడర్ అసంతృప్తి టెన్షన్ పెడుతోంది. సో రెండువైపులా గేమ్ ఆన్ లోనే ఉంది. మరి చివరికి నెగ్గేదెవరు?