Karumuri Nageswara: హైదరాబాద్ కొండాపూర్ నివాసంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం ఒక్కసారిగా ఈ కేసును టాప్ గేర్ దిశగా తీసుకెళ్లినట్లయింది. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కాంలో ఇది కీలక అడుగుగా చెబుతున్నారు. ఈ స్కాంలో మొత్తం 195 కోట్ల నష్టం జరిగిందని అభియోగాలున్నాయ్. టెండర్లలో అక్రమాలు, సబ్-కాంట్రాక్టులు, మనీ లాండరింగ్.. ఇవన్నీ కోణాల్లో ఈడీ విచారణ చేస్తోంది.
Also read: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్పై హరీశ్ రావు సెటైర్లు
ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి కుటుంబానికి 15 కోట్లు చేరాయని, ఆస్తులు అటాచ్ చేశామని ఈడీ ప్రకటించింది. ఇది రాజకీయ వేధింపులని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాతే అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్ట్లు ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి నెక్ట్స్ వికెట్ ఎవరిది? లిక్కర్ స్కాం ఇంకా ఎంత దూరం వెళ్తుంది?