Jana Sena: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా రోజులు ఉన్నా.. ఇప్పటికే చాలా హీటెక్కిపోయాయ్. గతంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా పని చేసిన డాక్టర్ గడల శ్రీనివాస్రావును అభ్యర్థిగా ఖరారు చేసింది జనసేన. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తొలి ఎంట్రీ ఇదే. మార్చి 2027లో జరగనున్న ఈ పోల్కు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలు పెట్టింది జనసే. ఇందులో చాలా రీజన్స్ ఉన్నాయి.
Alao Read: తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
తెలంగాణ ZPTC, MPTC ఎన్నికల్లోనూ పోటీకి అంటూ జనసేన సంకేతాలిస్తోంది. ఒంటరి పోరుతోనే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయాలు నడుస్తున్నాయ్. పలువురు కీలక నేతల్ని చేర్చుకునే ప్లాన్ కూడా ఉంది. సెప్టెంబర్ 13న ఖమ్మంలో జనసేన-శంఖారావం సభతో క్యాడర్ను మొబిలైజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మున్సిపల్ పోల్స్లో ఒక వార్డు గెలుపుతో ఖాతా తెరిచిన జనసేన… ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ మద్దతుతో బలం పెంచుకుంటుందా? తెలంగాణ రాజకీయాల్లో జనసేన స్పేస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నలున్నాయ్.